స్వయం పరిపాలన దినోత్సవం - Self Governance Day Celebration in MPUPS BORGI AURAD
![]() |
| Self Governance Day |
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల - బోర్గి ఏ నందు తేది: 07 మార్చి 2025 నాడు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని (Self Governance Day) పాఠశాల ప్రధానోపధ్యాయులు శ్రీ. కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. నేటి ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయులుగా,ప్రధానోపాధ్యాయులుగా,మండల విద్యాధికారిగా,పీఈటీగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు హుషారుగా, చలాకిగా తమ బాధ్యతలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారిగా సంగమేశ్వర్, మండల విద్యాధికారిగా ఓంకార్, ప్రధానోపాధ్యాయులుగా మారుతి, ఉపాధ్యాయులుగా కిరణ్ కుమార్, చింటూ, కీర్తన, నిఖిత, సరోజా, నితిన్, దర్శన్, సృజన్, PET గా అంబదాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు శంశోద్దిన్ గారు, వినయ్ కుమార్ గారు, భానుప్రియ గారు, మహబూబా గారు పాల్గొన్నారు. చివరగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
