79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – ప్రాథమికోన్నత పాఠశాల, బోర్గి ఔరాద్ | Independence Day Celebrations at MPUPS BORGI AURAD
సంగారెడ్డి జిల్లా, కంగ్టి మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల–బోర్గి ఔరాద్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం దేశభక్తి వాతావరణంతో కళకళలాడింది. ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, విద్యార్థులు గణపూర్వకంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయులు స్వాతంత్ర్యం ప్రాముఖ్యత, దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర గురించి ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో AAPC ఛైర్మెన్, తల్లిదండ్రులు, పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువజన సంఘ నాయకులు మరియు మొదలగు వారందరూ పాల్గొన్నారు.
ముగింపులో, విజేతలకు బహుమతులు పంపిణీ చేసి, మిఠాయిలు పంచారు. ఈ వేడుక దేశభక్తి, ఐకమత్యం, సేవాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది.



